లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం శనివారం విశాఖపట్టణంలో విన్నర్స్ వాక్ నిర్వహించారు. కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ విన్నర్స్ వాక్లో నటసింహ బాలకృష్ణ, నటీమణి గౌతమితోపాటు పలువురు పాల్గొన్నారు. క్యాన్సర్ పట్ల అందరు అవగాహన కలిగి ఉండాలని గౌతమి అన్నారు. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చని అక్టోబర్ నెలను క్యాన్సర్ విన్నర్స్ మంత్ గా నిర్వహిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ నుంచి బయటపడిన ప్రతి వ్యక్తి ఒక విజేత అని ఆమె అన్నారు. ఈ వాక్ ద్వారా క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కలుగుతుందని గౌతమి ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడి భగవంతుడి ఆశీస్పులవల్ల, ఆమె పట్టుదలవల్ల దాన్నిఅధిగమించి బయటపడ్డారని ప్రశంసించారు. అన్నారు. ఇప్పుడు లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ద్వారా ప్రజల మధ్యకు వచ్చి క్యాన్సర్పై వారికి అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను కూడా బసవతారకం ఇండో అమెరికన్ ఇనిస్టిట్యూట్కు ఛైర్మన్ అని తెలిపారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ వ్యాధికి తక్కువ ఖర్చుతో ప్రజలకు సేవలు ఆందిస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.